Type Here to Get Search Results !

AP BIFURCATION ACT 2014 IN TELUGU

0

ఆంధ్రప్రదేశ్ విభజన-సవాళ్లు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు - ఫిబ్రవరి 13, 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను లోక్‌సభ ఆమోదించిన రోజు : ఫిబ్రవరి 18, 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన రోజు : ఫిబ్రవరి 20, 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను రాజ్యసభ ఆమోదించిన రోజు : ఫిబ్రవరి 20, 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను అప్పటి రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన రోజు : మార్చి 1, 2014
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014ను ప్రభుత్వ రాజముద్ర(గెజిట్)లో ప్రచురించిన రోజు : మార్చి 4, 2014గమనిక: 2014, జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం భాగాలు : 12
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం షెడ్యూళ్లు : 13
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం సెక్షన్లు : 108
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014: భాగాలు - సంబంధిత సెక్షన్లు





పార్ట్ I - ప్రాథమికం(ప్రిలిమినరీ)/ ప్రవేశిక: సెక్షన్లు 1-2





పార్ట్ II - ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ: సెక్షన్లు 3-11





పార్ట్ III - చట్టసభలలో ప్రాతినిధ్యం: సెక్షన్లు12-29





పార్ట్ IV - హైకోర్టు : సెక్షన్లు 30-43





పార్ట్ V - వ్యయానికి అనుమతి, రాబడుల పంపిణీ : సెక్షన్లు 44-46





పార్ట్ VI - ఆస్తులు మరియు అప్పుల పంపిణీ : సెక్షన్లు 47-67





పార్ట్ VII - నిర్దిష్ట కార్పోరేషన్లకు నిబంధనలు : సెక్షన్లు 68-75





పార్ట్ VIII - సర్వీసులకు సంబంధించిన నిబంధనలు : సెక్షన్లు 76-83పార్ట్





IX - జలవనరుల నిర్వహణ మరియు అభివృద్ధి : సెక్షన్లు 84-91పార్ట్





X - మౌలికసదుపాయాలు - ఆర్థిక చర్యలు : సెక్షన్లు 92-94పార్ట్





XI - ఉన్నత విద్యావకాశాలు : సెక్షన్ 95పార్ట్





XII - న్యాయ మరియు ఇతర సంబంధిత నిబంధనలు : సెక్షన్లు 96-108






ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 షెడ్యూళ్లుషెడ్యూల్ 1 (సెక్షన్ 13):ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 18 రాజ్యసభ సీట్లలో 7 స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానంషెడ్యూల్ 2 (సెక్షన్ 15):పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు - 2008కు సవరణషెడ్యూల్ 3 (సెక్షన్ 24):శాసనమండలి నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు - 2006కు సవరణషెడ్యూల్ 4 (సెక్షన్ 22(2)):రెండు తెలుగు రాష్ట్రాలలోని శాసనమండలి సభ్యుల జాబితాషెడ్యూల్ 5 (సెక్షన్ 28):తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జాబితాషెడ్యూల్ 6 (సెక్షన్ 29):తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జాబితాషెడ్యూల్ 7 (సెక్షన్ 52):నిధుల జాబితా(ప్రావిడెంట్ ఫండ్‌‌స, పెన్షన్ ఫండ్‌‌స, ఇన్సూరెన్స్‌ ఫండ్‌‌స......)షెడ్యూల్ 8 (సెక్షన్ 59):ఫించన్ల బాధ్యతషెడ్యూల్ 9 ( సెక్షన్స్‌ 68-71):ప్రభుత్వ కంపెనీలు - కార్పోరేషన్ల జాబితాషెడ్యూల్ 10 (సెక్షన్75):కొన్ని నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో ప్రస్తుత వసతుల కొనసాగింపు - శిక్షణ సంస్థలు/కేంద్రాల పేర్ల జాబితాషెడ్యూల్ 11 (సెక్షన్ 85(8)(ఇ)):నదీ నిర్వహణా మండళ్ల విధి విధానాలుషెడ్యూల్ 12 (సెక్షన్ 92):బొగ్గు, చమురు - సహజ వాయువు, విద్యుత్షెడ్యూల్ 13 (సెక్షన్ 93): ఉన్నత విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పన 
ఆంధ్రప్రదేశ్ పునర్వవీస్థీకరణ చట్టం- 2014 సెక్షన్ల వారీ వివరణపార్ట్ I - ప్రవేశిక (సెక్షన్స్‌ 1,2)
సెక్షన్ 1 : చట్టం పేరు: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం - 2014
సెక్షన్ 2 : నిర్వచనాలు
అపాయింటెడ్ డే(నియమిత తేదీ) - జూన్ 2, 2014
అధికరణ - రాజ్యాంగంలోని అధికరణ
శాసనసభ నియోజక వర్గం, శాసనమండలి నియోజక వర్గం, పార్లమెంటరీ నియోజక వర్గం : ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950 ప్రకారం ఉన్న నిర్వచనం
ఎన్నికల కమిషన్ - ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటుచేస్తారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - నియమిత తేదీకి ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
చట్టం: శాసనం, ఆర్డినెన్స్‌, రెగ్యులేషన్, చట్టబద్ధమైన ఉత్తర్వు, నిబంధన, ఉపనిబంధన, నియమం, ఉపనియమం, పథకం, నోటిఫికేషన్...
నోటిఫైడ్ ఆర్డర్: అధికారక గెజిట్లో ప్రచురితమైన ఉత్తర్వు
జనాభా నిష్పత్తి: 58.32 : 41.68 (ఏపీ: తెలంగాణ)
ప్రస్తుత సభ్యులు : నియమిత తేదీకి ఆయా సభలలో ఉన్న సభ్యులు
ఏర్పడే రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ
బదలాయించిన భూభాగం : నియమిత తేదీనుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడిన భూభాగం
ట్రెజరీ
జిల్లా, మండలం, తహసిల్, తాలూకా లేదా ఇతర భూభాగం






పార్ట్ II - ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ (సెక్షన్స్‌ 3-11)





సెక్షన్ 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుసెక్షన్4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - దాని భూభాగాలునోట్: విభజన తరువాత పోలవరం ముంపు గ్రామాల బదలాయింపులో భాగంగా తెలంగాణ నుంచి 7 మండలాలను(5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా) ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగింది .





ఏపీలో పూర్తిగా కలిపిన మండలాలు:కుకునూరు, వెలేరుపాడు, వర రామచంద్రాపురం, చింతూరు మరియు కూనవరం
ఏపీలో పాక్షికంగా కలిపిన మండలాలు:భద్రాచలం(భద్రాచలం రెవిన్యూ గ్రామం మినహాయించి), బూర్గంపాడు(పినపాక, మోరంపల్లి, బంజర, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, కృష్ణాసాగర్, టేకులపల్లి, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పసాక, నక్రిపేట, సోంపల్లి గ్రామాలను మినహాయించి)
పై మండలాలలో బూర్గంపాడు, కుకనూరు, వేలేరుపాడులను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు.
వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, భద్రాచలం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు
సెక్షన్ 5: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్5(1): నియమిత తేదీ నుంచి ‘‘10 సంవత్సరాలకు మించని కాలానికి’’రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది5(2): ఆ కాల గడువు ముగిసిన తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది.నోట్: ప్రస్తుత ఉమ్మడి రాజధాని ప్రాంతం అనగా...‘‘హైదరాబాద్ పురపాలక చట్టం - 1955 ప్రకారం నోటిఫై చేయబడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC)’’సెక్షన్ 6: నూతన రాజధాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటునోట్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 ఆమోదించిన తేదీ నుంచి ‘‘6 నెలలు మించకుండా ‘‘ ఏపీ నూతన రాజధాని విషయమై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేస్తుందిసెక్షన్ 7: రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరే రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ‘‘ కొనసాగుతారుసెక్షన్ 8: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.!!8(1): నియమిత తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా నిర్వహణ, నివసించే ప్రజలందరి ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రతలను కాపాడే బాధ్యత గవర్నర్‌దే.8(2): ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రతలు, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణల బాధ్యత గవర్నర్‌దే8(3): గవర్నర్ తన విధినిర్వహణలో ‘‘తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన పిదప’’ తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోగలరు. గవర్నర్ నిర్ణయం అంతిమం. దాన్ని ప్రశ్నించటానికి వీలులేదు8(4): గవర్నర్‌కు సహాయసహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం ‘‘ఇద్దరు సలహాదారులను ‘‘ నియమిస్తుంది.సెక్షన్ 9: కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నుంచి పోలీసు దళాల సహకారం9(1): కొత్తగా ఏర్పాటయ్యే రెండు తెలుగు రాష్ట్రాలకు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంలో కేంద్రం సహాయం చేస్తుంది.9(2): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహాండ్‌‌స శిక్షణా కేంద్రం నియమిత తేదీనుంచి మూడేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ మూడు సంవత్సరాల పాటు ఈ శిక్షణాకేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది. తరువాత ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది.9(3): మూడేళ్ల తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న చోట అత్యాధునిక వసతులతో కూడిన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కేంద్రప్రభుత్వం సహాయం చేస్తుంది9(4): కొత్తగా ఏర్పాటయ్యే రెండు తెలుగు రాష్ట్రాలు తాము నిర్ణయించుకున్నచోట గ్రేహాండ్‌‌స కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది9(5): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గ్రే హాండ్‌‌స ఆక్టోపస్ దళాలను ఆయా సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్న తరువాత రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. తరువాత వీరు ఆయా రాష్ట్రాల డీజీపీల ఆధీనంలో పనిచేస్తారు
సెక్షన్ 10: రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌కు సవరణసెక్షన్ 11: రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పరిరక్షించడం, కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని ఏదేని జిల్లా లేదా ఇతర ప్రాదేశిక భూభాగం యొక్క పేరు, విస్తీర్ణం లేదా సరిహద్దులను మార్చుకోవడంలో సొంత అధికారాలను కలిగి ఉంటాయి. 






పార్ట్ III- చట్టసభలలో ప్రాతినిథ్యం(సెక్షన్స్‌ 12-29):





రాజ్యసభ: సెక్షన్ 12: రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్‌కు సవరణవివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాలు - 18
విభజన తర్వాత:
ఏపీకి- 11 రాజ్యసభ స్థానాలు
తెలంగాణకు - 7 రాజ్యసభ స్థానాలు
సెక్షన్ 13: ప్రస్తుత సభ్యుల కేటాయింపువివరణ: ఉమ్మడి ఏపీలోని 18 మంది రాజ్యసభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీచేయుటకు ఎన్నికైన వారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు
లోక్‌సభ : సెక్షన్ 14: లోక్‌సభలో ప్రాతినిధ్యంవివరణ: ప్రజాప్రాతినిథ్య చట్టం - 1950కు సవరణఉమ్మడి ఏపీలోని లోక్ సభ సభ్యుల సంఖ్య - 42
విభజన తరువాత:
ఏపీకి - 25 తెలంగాణకు - 17
సెక్షన్ 15: పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనవివరణ: పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన ఆర్డర్ - 2008కు సవరణ.ఈ సవరణ ప్రకారం నూతన రాష్ట్రాల లోక్‌సభ మరియు శాసనసభలకు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చు
సెక్షన్ 16: ప్రస్తుత సభ్యులకు సంబంధించిన నిబంధనవివరణ: ఉమ్మడి ఏపీలోని 42 మంది లోక్‌సభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీచేయుటకు ఎన్నికై న వారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు 
శాసనసభ :





 సెక్షన్ 17: శాసనసభకు సంబంధించిన నిబంధనలువివరణ: ఉమ్మడి ఏపీలోని శాసనసభ సభ్యులు - 294
రిజర్వ్‌డ్ స్థానాలు : ఎస్సీ - 39, ఎస్టీ - 15
విభజన తర్వాత :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు - 175
ఎస్సీ రిజర్వ్‌డ్ - 29
ఎస్టీ రిజర్వ్‌డ్ - 7
తెలంగాణ శాసనసభ సభ్యులు - 119
ఎస్సీ రిజర్వ్‌డ్ - 19; ఎస్టీ రిజర్వ్‌డ్ - 12
సెక్షన్ 18: ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యంవివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 333 ప్రకారం తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే గవర్నర్ రెండు తెలుగు శాసనసభలకు ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్‌ని నామినేట్ చేయవచ్చు.నోట్: ప్రస్తుత ఏపీ శాసనసభలోని ఆంగ్లో ఇండియన్ - ఫిలిప్ సి థోచర్
సెక్షన్ 19: ప్రస్తుత సభ్యుల కేటాయింపువివరణ: ఉమ్మడి ఏిపీలోని 294 మంది శాసనసభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీ చేయుటకు ఎన్నికైనవారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు.
సెక్షన్ 20: శాసనసభల కాలవ్యవధివివరణ: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల ఐదేళ్ల కాలవ్యవధి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రారంభమైన తేదీ నుంచి’’ప్రారంభమైనట్లు భావించాలి.
సెక్షన్ 21: సభాపతి, ఉపసభాపతి ప్రక్రియ నియమాలు21(1): నియమిత తేదీకి ముందున్న ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ నియమిత తేదీ తర్వాత కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్‌గా కొనసాగుతారు. తర్వాత ఆ శాసనసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.21(2): నియమిత తేదీ తర్వాత ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్ కార్యాలయ విధులను నిర్వహిస్తారు.21(3): నియమిత తేదీకి ముందు అమలులో ఉన్న ఉమ్మడి ఏిపీ శాసనసభ ‘‘కార్య విధాన కార్యక్రమ నిర్వహణా నియమావళి’’, కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్తగా నియమావళి రూపొందించుకునేంతవరకు, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చేసే సవరణలకు లోబడి ఆ రాష్ట్ర అసెంబ్లీ నియమావళిగా కొనసాగుతుంది.సెక్షన్ 22: రెండు రాష్ట్రాలకు శాసనపరిషత్తులువివరణ: రాజ్యాంగంలోని అధికరణ 169 ప్రకారం...
ప్రస్తుతం ఏపీ విధానపరిషత్ స్థానాలు - 58
ప్రస్తుతం తెలంగాణ విధానపరిషత్ స్థానాలు - 40
సెక్షన్ 23: విధానపరిషత్ విధివిధానాలు వివరణ: ఆంధ్రప్రదేశ్ : మొత్తం స్థానాలు - 58
స్థానిక ప్రజాప్రతినిధులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 20
శాసనసభ సభ్యులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 20
టీచర్ ఎమ్మెల్సీలు - 5
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు - 5
నామినేటెడ్ ఎమ్మెల్సీలు - 8
తెలంగాణ : మొత్తం స్థానాలు - 40
స్థానిక ప్రజాప్రతినిధులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 14
శాసనసభ సభ్యులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 14
టీచర్ ఎమ్మెల్సీలు - 3
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు - 3
నామినేటెడ్ ఎమ్మెల్సీలు - 6
నోట్: సెక్షన్ 23(ii) ప్రకారం నాల్గవ షెడ్యూల్‌లో తమిళనాడు తర్వాత తెలంగాణ అనే శీర్షికలో కింది ఎంట్రీలను చేర్చాలి
మున్సిపల్ కార్పోరేషన్లు
మున్సిపాలిటీలు
నగరపంచాయతీలు
కంటోన్మెంట్ బోర్డులు
జిల్లా ప్రజా పరిషత్‌లు
మండల ప్రజా పరిషత్‌లు
సెక్షన్ 24: శాసనమండలి నియోజకవర్గాల పునర్విభజన - 2014కు సవరణసెక్షన్ 25: శాసనమండలి చైర్మన్,డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నియమాలు25(1): నియమిత తేదీకి ముందున్న ఉమ్మడి ఏపీ శాసనమండలి చైర్మన్ నియమిత తేదీ తర్వాత కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నూతన శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతారు. తర్వాత ఆ శాసనమండలి సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.సెక్షన్ 26: నియోజకవర్గాల పునర్విభజనవివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి నూతనంగా ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఈ విధంగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్: 175 నుంచి 225కు
తెలంగాణ: 119 నుంచి 153కు
నోట్: 2026 వర నియోజకవర్గాల పునర్విభజన (సీట్ల పెంపు) ఉండదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది.
సెక్షన్ 27: నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి గల అధికారాలుసెక్షన్ 28: షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు - 1950కు సవరణ (చట్టంలోని 5వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)సెక్షన్ 29: షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు - 1950కు సవరణ(చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)






పార్ట్ IV - హైకోర్టు (సెక్షన్స్‌ 30-43) 





సెక్షన్ 30: ఆంధ్రప్రదేశ్‌లో నూతన హైకోర్టు ఏర్పాటయ్యేంతవరకు హైదరాబాద్ హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది30(1): నియమిత తేదీ నుంచి...ఎ) హైదరాబాద్‌లోని హైకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం, విభజన చట్టంలోని సెక్షన్ 31 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు రెండు రాష్ట్ర లకు ఉమ్మడి హైకోర్టుగా ఉండాలి.బి) నియమిత తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆ తర్వాత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులవుతారు30(2): ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య కేటాయించాలి
సెక్షన్ 31: ఆంధ్రప్రదేశ్ హైకోర్టునోట్: 31(2): ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు కేంద్రస్థానం రాష్ట్రపతి నిర్ణయించిన ప్రదేశంలో ఉంటుంది
సెక్షన్ 32: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుసెక్షన్ 33: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిసెక్షన్ 34: బార్ కౌన్సిల్‌లు, అడ్వకేట్లకు సంబంధించిన ప్రత్యేక నిబంధనసెక్షన్ 35: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వృత్తి నిర్వహణ కార్య విధానంసెక్షన్ 36: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముద్ర (సీల్) అధీనతసెక్షన్ 37: రిట్‌లు,ఇతర ప్రక్రియల స్వరూపంసెక్షన్ 38: న్యాయమూర్తుల అధికారాలుసెక్షన్ 39: సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేట కార్యవిధానంసెక్షన్ 40: హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రొసీడింగుల బదిలీసెక్షన్ 41: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసిన ప్రోసీడింగ్‌‌స విషయంలో అప్పీలు చేసుకోవడానికి లేదా చర్య తీసుకోవడానికి అధికారంసెక్షన్ 42: వ్యాఖ్యానంసెక్షన్ 43: మినహాయింపులు
ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు:
ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్ విడుదలైన తేదీ : 26 డిసెంబర్, 2018
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు ప్రారంభైమైన రోజు : జనవరి 1, 2019 (రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రారంభించినవారు : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభించిన రోజు : ఫిబ్రవరి 3, 2019
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించినవారు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్
ఆంధ్రప్రదేశ్ శాశ్వత హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన వారు : జస్టిస్ రంజన్ గగోయ్
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఎక్కడ నిర్మించారు : నేలపాడు (గుంటూరు)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతన తొలి న్యాయమూర్తుల సంఖ్య (ప్రస్తుతం):1+13=14
నోట్: వాస్తవంగా విభజన ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు దక్కిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య : 37
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించినవారు : ఏపీ గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తరువాత పరిశీలనకు వచ్చిన మొదటి కేసు : విశాఖ మహానగరపాలక సంస్థ V/S గాజుల శోభారాణి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులు :
జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్(తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి)
జస్టిస్ ఎ వి శేషసాయి
జస్టిస్ ఎం. సీతారామమూర్తి
జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి
జస్టిస్ దుర్గాప్రసాద్ రావు
జస్టిస్ సునీల్ చౌదరి
జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి
జస్టిస్ జి. శ్యామ్ ప్రసాద్
జస్టిస్ కె. ఉమాదేవి
జస్టిస్ యన్. బాలయోగి
జస్టిస్ టి. రజని
జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు
జస్టిస్ కొంగరపు జయలక్ష్మి
జస్టిస్ ఎం. గంగారావు






పార్ట్ V- వ్యయానికి అనుమతి, రాబడుల పంపిణీ (సెక్షన్స్‌ 44-46)





సెక్షన్ 44: తెలంగాణ రాష్ట్రంలో వ్యయానికి అనుమతి ఇవ్వడంసెక్షన్ 45: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లెక్కలకు సంబంధించిన నివేదికలుసెక్షన్ 46: రాబడిని పంపిణీ చేయుటవివరణ: 46(1): రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం నుంచి వచ్చే పన్ను పంపకం 13 వ ఆర్థికసంఘం ఆదేశాలకు అనుగుణంగా చేయాలిప్రాతిపదిక: జనాభా దామాషా46(2): నూతనంగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సముచిత గ్రాంట్లను ఇవ్వవచ్చు.46(3): అవశేష ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల అభివృద్దికి కేంద్రం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని, తగిన ప్రోత్సాహాకాలను కల్పించాలి






పార్ట్ VI - ఆస్తులు,అప్పుల పంపకం(సెక్షన్స్‌ 47-67)





సెక్షన్ 47: ఈ భాగం వర్తింపు47(1): ఈ భాగంలోని నిబంధనలు నియమిత తేదీకి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి వర్తిస్తాయి 47(2): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి47(3): రెండు రాష్ట్రాల అవసరాన్ని బట్టి ఆర్థిక సర్దుబాటుకు లోబడి ఆస్తులు, అప్పుల పంపకం జరగాలి47(4): రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం విషయంలో సమస్యలు తలెత్తితే ‘‘భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’’ సలహాపై కేంద్రం పరిష్కరించాలి
సెక్షన్ 48: భూమి మరియు వస్తువులువివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు, అన్ని స్టోర్లు, సామాగ్రి, వస్తువులు...ఎ) బదీలీ అయిన సరిహద్దు లోపల ఉంటే తెలంగాణ రాష్ట్రానికిబి) ఇతర ఏ సందర్భంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి.నోట్: 48(1): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు , అన్ని స్టోర్లు, సామాగ్రి, వస్తువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నెలకొని ఉంటే అట్టి ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంపకం చేయాలి.48(2): ప్రత్యేక సంస్థలు, వర్క్‌షాప్‌లు, స్టోర్ లు... మొదలైన వాటిని అవి ఏ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి48(3): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అధికార పరిధి కలిగిన సచివాలయ శాఖాధిపతులను
సెక్షన్ 49: ఖజానా మరియు బ్యాంకు నిల్వలుపంపిణీ ప్రాతిపదిక - జనాభా దామాషానోట్: ఈ పంపిణీ భారత రిజర్వ్ బ్యాంకు పుస్తకాల్లో రెండు రాష్ట్రాల పరపతి నిల్వలను సర్దుబాటు చేయడం ద్వారా భాగ నిర్ణయాన్ని అమలుపరచాలి. అంతేకానీ ట్రెజరీల ద్వారా నగదు బదిలీ చేయకూడదు
సెక్షన్ 50: పన్ను బకాయిలువివరణ: బకాయిలను వసూలు చేసే హక్కు సంబంధిత ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం కలిగి ఉంటుందిసెక్షన్ 51: రుణాలు,అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు51(1): రుణాలు, అడ్వాన్సులు పొందిన సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం సంబంధిత రుణాలు, అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు కలిగి ఉంటుంది51(2): ఒకవేళ ఆ రుణాలు, అడ్వాన్సులు పొందిన సంస్థలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉంటే వాటిని వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంటుంది.ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ వసూలు చేసిన రుణాలు, అడ్వాన్సులు ‘‘జనాభా ప్రాతిపదికన’’ రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.
సెక్షన్ 52: కొన్ని నిధులలో పెట్టుబడులు, పరపతులుసెక్షన్ 53: రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులుపంపిణీ ప్రాతిపదిక: స్థానిక సంస్థల ఆస్తులు, అప్పులు - అవి ఉన్న రాష్ట్రానికిఅంతరాష్ట్ర హోదా కల్గిన సంస్థల ప్రధాన కార్యాలయాలను ‘‘జనాభా ప్రాతిపదికన ‘‘ పంచాలి.సెక్షన్ 54: ప్రజారుణంవివరణ: జనాభా దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగాలిసెక్షన్ 55: స్వల్పకాలిక రుణంవివరణ: స్వల్పకాలిక రుణ ఉద్దేశ్యాలు నియమిత తేదీన లేదా ఆ రోజు నుంచి ఏర్పాటయ్యే రాష్ట్రాలలో ఏదైనా రాష్ట్రం నిమిత్తం అయినట్లయితే అప్పుడు ఆ రాష్ట్రానికే ఉండాలిఏదైనా ఇతర సందర్భాలలో దానిని జనాభా ప్రాతిపదికన పంచాలిసెక్షన్ 56: అధికంగా వసూలు చేసిన పన్నులను వాపసుచేయుటవివరణ: నియమిత తేదీ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికంగా వసూలు చేసిన పన్నులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంచాలి
సెక్షన్ 57: డిపాజిట్లువివరణ: నియమిత తేదీ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్వహించిన ఏవైనా పౌరడిపాజిట్‌లు, రుణనిధులు లేదా దాతృత్వ లేదా ఎండోమెంట్ సంస్థల నిధులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంచాలి
సెక్షన్ 58: భవిష్యనిధివివరణ: నియమిత తేదీ నాటికి సర్వీసులో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వితంగా ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో భవిష్యనిధి ఖాతా విషయంలో ఆ రోజు నుంచి ఉత్తరాధికారం పొందిన రాష్ట్రం బాధ్యత వహించాలిసెక్షన్ 59: ఫించన్లువివరణ: చట్టంలోని 8వ షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాలు ఫించన్లను బదిలీ చేయాలిసెక్షన్ 60: ఒప్పందాలుసెక్షన్ 61: చర్య తీసుకోదగిన తప్పు చేసినట్లయితే బాధ్యతవివరణ: సంబంధిత చర్య ఏ రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతంలో జరిగి ఉంటే ఆ రాష్ట్రమే బాధ్యత వహించాలి.ఇతర సందర్భాలలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపదికన పంపకాలు జరగాలిసెక్షన్ 62: పూచీదారుని బాధ్యతవివరణ: రాష్ట్రం లోపల జరిగిన పూచీకత్తు సందర్భాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే బాధ్యత వహించాలిఇతర ఏదైనా సందర్భాలలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపదికన పంపకాలు జరగాలిసెక్షన్ 63: అనిశ్చిత స్థితిలో ఉన్న అంశాలుసెక్షన్ 64: అవశేష నిబంధనసెక్షన్ 65: ఆస్తులపంపకం లేదా ఒప్పందం వలన బాధ్యతలుసెక్షన్ 66: కొన్ని సందర్భాలలో కేటాయింపు లేదా సర్దుబాటు చేయడంలో కేంద్రప్రభుత్వానికి గల అధికారంసెక్షన్ 67: సంచితనిధి పై ఛార్జీ చేసే కొన్ని వ్యయాలు






పార్ట్ VII - కొన్ని కార్పోరేషన్లకు సంబంధించిన నియమాలు (సెక్షన్స్‌68-75):





 సెక్షన్ 68: వివిధ కార్పోరేషన్లు, కంపెనీలకు సంబంధించిన నిబంధనలువివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పాటైన కంపెనీలు,కార్పోరేషన్లు నియమిత తేదీ నుంచి కూడా అదే ప్రాంతంలో కొనసాగాలి. కార్పోరేషన్ల ఆస్తులు,హక్కులు, బాధ్యతలు రెండు రాష్ట్రాల మధ్య పంచాలిసెక్షన్ 69: విద్యచ్చక్తి ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకు, నీటి సరఫరా కొనసాగించడానికి నియమాలుసెక్షన్ 70: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థవివరణ: రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం - 1951లోని 63వ చట్టం ప్రకారం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ప్రస్తుతం మాదిరిగానే నియమిత తేదీ తరువాత కూడా కేంద్రప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ ఉంటుందిసెక్షన్ 71: కొన్ని కంపెనీలకోసం నిబంధనలుసెక్షన్ 72: ప్రస్తుతమున్న రోడ్డు రవాణా పర్మిట్లను కొనసాగించడానికి తాత్కాలిక నిబంధనలుసెక్షన్ 73: తొలగింపు నష్టపరిహారానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలుసెక్షన్ 74: ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనసెక్షన్ 75: కొన్ని రాష్ట్ర సంస్థలకు సౌకర్యాల కొనసగింపు






పార్ట్ VIII - సర్వీసులకు సంబంధించిన నియమాలు(సెక్షన్స్‌ 76-83)





సెక్షన్ 76: అఖిలభారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలువివరణ: రాష్ట్ర క్యాడర్ అంటే...
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐఎఎస్
ఇండియన్ పోలీస్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐపీఎస్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐఎఫ్‌ఎస్
సెక్షన్ 77: ఇతర సర్వీసులకు సంబంధించిన నిబంధనలుసెక్షన్ 78: సర్వీసు నియమాలువివరణ: సర్వీసు వ్యవహారాలు, విఙ్ఞప్తులు, వివాదాలు పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి నియమిత తేదీ నుంచి 30 రోజులలోపు కేంద్రం సలహాసంఘాలను నియమిస్తుందిసెక్షన్ 79: అదే పదవిలో అధికార్ల కొనసాగింపునకు నిబంధనసెక్షన్ 80: సలహాసంఘాలుసెక్షన్ 81: ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి గల అధికారంసెక్షన్ 82: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు నిబంధనవివరణ: నియమిత తేదీ నుంచి రాష్ట్రప్రభుత్వరంగ సంస్థలలోని, కార్పోరేషన్లు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలోని ఉద్యోగులు అట్టి ప్రభుత్వరంగ సంస్థలలోని ఉద్యోగాలలో ఒక సంవత్సరం పాటు కొనసాగుతారు. ఈ సమయంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు పై రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకానికి విధివిధానాలను రూపొందిస్తాయిసెక్షన్ 83: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిబంధనలువివరణ: నియమిత తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కొనసాగుతుంది.తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి అనుమతితో యూపీఎస్సీ విధులు నిర్వహిస్తుంది. 






పార్ట్ IX- జలవనరుల నిర్వహణ,అభివృద్ధి(సెక్షన్స్‌ 84-91)





సెక్షన్ 84: గోదావరి,కృష్ణా నదీజలాల వనరులు,వాటి నిర్వహణ మండళ్ళకు అపెక్స్ కౌన్సిల్ (శిఖరాగ్ర మండళి) ఏర్పాటు84(1): గోదావరి,కృష్ణా నదీజలాల వనరనలు,వాటి నిర్వహణ మండళ్ళ పనితీరుని పర్యవేక్షించడం కోసం కేంద్రప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ (శిఖరాగ్ర మండళి) ఏర్పాటు చేస్తుంది84(2): ఈ అపెక్స్ కౌన్సిల్ కుఎ)ఛెర్మైన్: కేంద్ర జలవనరుల మంత్రిబి)ఒక సభ్యుడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిసి)మరొక సభ్యుడు: తెలంగాణ ముఖ్యమంత్రి84(3): అపెక్స్ కౌన్సిల్ విధులు: i)గోదావరి,కృష్ణా నదుల మండళ్ళ నిర్వహణ బాధ్యతలను చేపట్టడంii)అవసరమైన సంధర్భాలలో కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం నదీ నిర్వహణ మండళ్ళు,కేంద్ర జలసంఘం చేసిన ప్రతిపాదనలపై ప్రణాళిక రూపొందించడం,ఆమోదించడంiii)కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ పై ఏదైనా వివాదం తలెత్తితే సంప్రదింపుల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకొని పరిష్కరించడంiv)కృష్ణా నదీజలాల వివాదైల పరిష్కార ట్రిబ్యునల్ పరిధిలో లేని వివాదాలను అంతరాష్ట్ర నదీ
జలవివాదాల చట్టం: 1956 ప్రకారం ఏర్పాటు చేయబడే ట్రిబ్యునల్ కు రెఫర్ చేయడం
సెక్షన్ 85: జల నిర్వహణ మండళి ఏర్పాటు,విధులు85(1).రాష్ట్రం ఏర్పాటైన 60 రోజుల్లోగా ప్రస్తుత,భవిష్యత్ లో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన,క్రమబద్ధీకరణ,నిర్వహణ,పనితీరు పర్యవేక్షణకు కేంద్రప్రభుత్వం విడిగా గోదావరి జల నిర్వహణ మండలి,కృష్ణా జల నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తుంది.85(2) గోదావరి జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం తెలంగాణలో, కృష్ణా జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తారు.85(3) ఈ రెండు బోర్డులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తాయి85(4) జల నిర్వహణ మండలి బోర్డు ఛెర్మైన్ మరియు సభ్యులుంఎ)ఛెర్మైన్: భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదా గల వ్యక్తి(కేంద్ర నియామకం)బి)ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించే ఇద్దరు సభ్యులు.ఒకరు చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని సాంకేతిక నిపుణుడు;మరొకరు పరిపాలనా రంగ నిపుణుడుసి)కేంద్రం నియమించే ఇంకొక నిపుణుడు85(5).బోర్డు యొక్క పూర్తిస్థాయి సభ్యకార్యదర్శి: కేంద్రజలవనరుల సంఘం ఛీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని వ్యక్తి(కేంద్ర నియామకం)85(6). కేంద్ర జలసంఘంలో అవసరమైనన్ని ఛీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టులను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలి85(7).రిజర్వాయర్ల రోజువారి నిర్వహణ కోసం బోర్డులు కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సహాయం చేసుకుంటాయి.ఆ విధివిధానాలను కేంద్రం నిర్దేశిస్తుంది.85(8)బోర్డుల విధులు: ఎ)కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటిసరఫరా నియంత్రణi) అంతరాష్ట్ర నదీ జలవివాదాల చట్టం: 1956 కింద ఏర్పడిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా..ii)ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంతో ఏదేనీ రాష్ట్రం లేదా కేంద్రపేరాంతపాలిత ప్రాంతం తో జరిగిన ఒప్పందాలు,ఏర్పాట్లకు అనుగుణంగాం.బి)ఆయా సంస్థలకు విద్యుత్ సరఫరాను నియంత్రించడంసి) కొత్తగా ఏర్పడే రాష్ట్రాల నదులు,వాటి ఉపనదులపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను మదింపు చేయడండి)గోదావరి,కృష్ణా నదులపై ఇప్పటికే నిర్మించిన, నియమిత తేదీనాటికి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు నష్టం కలగదని, జలవివాద ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం కలగదని నిర్ధారించుకున్నాక,నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సాంకేతిక ఆమోదం తెలపడంఇ)11 వ షెడ్యూల్ లో పేర్కొన్న అంశాల ప్రాతిపదికన కేంద్రం అప్పగించే ఇతర కర్తవ్యాలుసెక్షన్ 86: బోర్డు సిబ్బందినోట్: బోర్డు సిబ్బంది యొక్క జీతభత్యాల నిష్పత్తిని కేంద్రం నిర్ణయించిన మేర రెండు రాష్ట్రాలు భరించాలి
సెక్షన్ 87: మండలి పరిధినోట్: గోదావరి,కృష్ణా బోర్డుల పరిధి ఆ రెండు నదులకు విస్తరించి ఉంటుంది.ఇందులో ఏదైనా సమస్య ఉంటే దాని నివృత్తికి కేంద్రానికి పంపిస్తారుసెక్షన్ 88: మండలి అధికారంఎ)సమావేశ సమయం,స్థలం,నిర్వహణా పద్దతిని నిర్ణయించుకోవడంబి)బోర్డు ఛెర్మైన్ లేదా అధికారి అధికారాలను దఖలు పరచడంసి)అధికారులు, సిబ్బంది నియామకాలు, విధి విధానాలను నిర్ణయించడండి)అవసరమైన ఇతర నిబంధనలను రూపొందించుకోవడం
సెక్షన్ 89: నీటి వనరుల కేటాయింపునోట్: కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ గడువు కింది విధివిధానాలతో పొడిగించబడుతుంది.ఎ)ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడంబి)నీటి ప్రవాహం తగ్గిన సందర్భాలలో ఆయా ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు విధివిధానాలను నిర్ణయించడం.
సెక్షన్ 90: జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు 90(1). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమైనది90(2). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి,నియంత్రణను కేంద్రం చేపడుతుంది90(3). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం తన ఆమోదాన్ని తెలియచేసినట్టే భావించాలి90(4). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల పర్యావరణ,అటవీ,పునరావాస,పునర్నిర్మాణ నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను పొంది కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.
సెక్షన్ 91: తుంగభద్ర బోర్డు ఏర్పాటువివరణ: ఈ బోర్డులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి.ఈ బోర్డు పర్యవేక్షించే పథకాలు: హై లెవల్ కెనాల్,లో లెవల్ కెనాల్,రాజోలి బండ మళ్ళింపు పథకాలు
పోలవరం ప్రాజెక్టు: ముఖ్యమైన సమాచారం
పోలవరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ!
గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు.
ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవడం లేదు. అనేక ఒడుదొడుకుల మధ్య పయనిస్తోంది.
సకాలంలో నిధులు ఇవ్వడం లేదంటోంది రాష్ట్రం. ఇచ్చినవాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది.
ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏమిటి?
ఇలా ప్రారంభం..
పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది.
1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు.
దీని అంచనా వ్యయం రూ.129 కోట్లు.
విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు.
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడం.
విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు.
వెనకడుగు :
రామపాదసాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణపరంగా అడుగు ముందుకు పడలేదు.
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
ఒకటి వ్యయం.. రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత.
పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు.
డ్యాం కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండటం లేదు. మరోవైపు కొండలు, గుట్టలు ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు.
1953 వరదలు :
1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి.
దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది.
ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు :
బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం..
పూర్తి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం
స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు
పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతు న్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి.





1976లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు.
1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు.
ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు.
పోలవరం మౌలిక స్వరూపం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి.
రిజర్వాయర్
స్పిల్‌వే
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
రిజర్వాయర్: ఇందులో నీటిని నిల్వ చేస్తారు.స్పిల్‌వే: రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్‌వే ఉపయోగడుతుంది. రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

close